సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: ప్రజల శ్రేయస్సే ఉమ్మడి లక్ష్యంగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పని చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. సచివాలయం ఐదో బ్లాక్లోని కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మంత్రి.. ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఔషధ నియంత్రణ విభాగానిది ముఖ్య పాత్ర అని కొనియాడారు.
రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మందుల ఊసే ఉండకూడదని, ఈ విషయంలో ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మందుల దుకాణాలకు లైసెన్స్ల జారీ, రెన్యువల్ విషయంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. ఔషధ తయారీ కంపెనీలు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నారో, లేదో పర్యవేక్షించాలన్నారు.
ఔషధ నియంత్రణ విభాగానికి గతంలో జిల్లాల్లో ఎక్కడా కనీసం కార్యాలయాలు కూడా ఉండేవి కావని, సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఉండేలా కృషి చేశారని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీలోని ఎన్సీడీసీ(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ప్రధాన కార్యాలయం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్సీడీసీ సెంటర్ల నిర్మాణానికి మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు.
ఏపీ నుంచి మంత్రి రజిని పాల్గొని మాట్లాడుతూ మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో రీజినల్ ఎన్సీడీసీ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, హెచ్ ఐవీ.. ఇలా అన్ని రోగాలకు ఈ సెంటర్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేస్తారని వివరించారు.
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలి
Published Wed, Sep 7 2022 6:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement