పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Published Fri, Nov 24 2023 1:42 AM

ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాసు  - Sakshi

దాచేపల్లి: పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. నడికుడి రైల్వేస్టేషన్‌ సమీపంలోని 15వ వార్డులో 55 ఏళ్లుగా నివాసం ఉంటున్న 50 పేద కుటుంబాలకు ఇంటి పట్టాలను గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివాసం ఉంటున్న ఈ కాలనీలో సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లిన వెంటనే పట్టాలు ఇప్పించారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని పేదలు చెప్పారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్‌ మునగా పున్నారావు, మాజీ సర్పంచులు మందపాటి రమేష్‌రెడ్డి, బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు కొమెరబత్తిన విజయ్‌కుమార్‌, షేక్‌ ఖాదర్‌బాషా, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు షేక్‌ సుభానీ, కోట కృష్ణ, సోసైటి అధ్యక్షుడు బత్తుల లింగారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ జాకీర్‌హుస్సేన్‌, నాయకులు కొమెరబత్తిన ఆనంద్‌కుమార్‌, ఓర్సు దుర్గారావు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

ఇళ్ల పట్టాలు పంపిణీ

Advertisement
Advertisement