భారత్‌ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత

Published Thu, Sep 21 2023 6:14 AM

Indian Economy Doing Well Even In Unsupportive Global Environment - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్‌–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్‌ అవుట్‌లుక్‌  6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది.

ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్‌ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది.  

5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్‌: ఇండియా రేటింగ్స్‌
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్‌ షీట్లు, గ్లోబల్‌ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్‌ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్‌ ప్రధాన ఎకనమిస్ట్‌ సునిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.   (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్‌?)

మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్‌
ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్‌ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్‌ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్‌బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement