Sakshi News home page

Kia India: అదరగొట్టిన కియా.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి!

Published Fri, Jul 14 2023 6:55 AM

kia production crosses 10 lakh units in india details - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ ప్లాంటులో 2019 ఆగస్ట్‌ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు.

(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్‌ రంగాన్నే షేక్‌ చేసిన ఇండియన్‌!)

అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్‌ మోడల్‌ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్‌ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్‌ ప్రారంభం.

Advertisement

తప్పక చదవండి

Advertisement