Man Booked For Harassing Young Woman In Kurnool District - Sakshi
Sakshi News home page

యువతితో సన్నిహితంగా ఉంటూ.. ఫొటోలు తీసి..

Published Sun, Dec 12 2021 4:12 PM

Man Booked For Harassing Young Woman In Kurnool District - Sakshi

గడివేముల(కర్నూలు జిల్లా): ప్రేమ పేరుతో మోసం చేసి, యువతిని వేధిస్తున్న చిందుకూరు గ్రామానికి చెందిన చక్రధర్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు శనివారం విలేకరులకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో చక్రధర్‌ సన్నిహితంగా మెలుగుతూ.. ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఫొటోలు తీసుకున్నాడని, వాటిని చూపిస్తూ పెళ్లి సంబంధాలు చెడగొట్టే వాడన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపుతానని చక్రధర్‌ బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.
చదవండి: Tekkali: మరో నకిలీ బాగోతం: రశీదు అబద్ధం.. దోపిడీ నిజం     

Advertisement
Advertisement