జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

14 Aug, 2021 16:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్‌ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైసే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉ‍గ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు