బాస్కెట్‌బాల్‌లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:58 AM

- - Sakshi

పెనుమంట్ర : ఇటీవల నూజివీడులో జరిగిన అంతర్‌జిల్లా అండర్‌–14, అండర్‌–17 బాస్కెట్‌బాల్‌ పోటీలలో మార్టేరుకు చెందిన శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలకు చెందిన బాలురు, శ్రీబాసంతీదేవి బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు విశేష ప్రతిభ కనబరిచినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెల్లబోయిన శివజ్యోతి, ఎస్టీ గణపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మార్టేరు వేణుగోపాల ఉన్నత పాఠశాలకు చెందిన జుత్తిగ అనీష్‌, మారుమూడి కృపాల్‌, పెనుగొండ కిరణ్‌ అండర్‌–14 విభాగంగలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారని, అదేవిధంగా అండర్‌–17 విభాగంలో నక్కా సందీప్‌, గెద్దాడ శివసాయి, నీలాపు వినయ్‌, అప్పారి మోహన్‌రామ్‌శెట్టి పశ్చిమ గోదావరి జట్టుకు రజత పథకం అందించారని పీఈటీ కర్రి కృష్ణారెడ్డి తెలిపారు. అండర్‌–14 బాలికల విభాగంలో వాసంతీదేవి బాలికోన్నత పాఠశాలకు చెందిన బి జ్యోష్ని గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు పీడీ వారధి వెంకటరమణ తెలిపారు. విద్యార్ధులను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తదితరులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement