మంగళగిరి: అన్ని దేశాలలో యాంటీ బయాటిక్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోందని, ఇది మానవ జాతి మనుగడకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో రెండు రోజులపాటు జరగనున్న యాంటీ బయాటిక్స్ వాడకం, ప్రత్యామ్నాయ మార్గాలపై అంతర్జాతీయ సదస్సును బుధవారం యూనివర్శిటీ వీసీ డాక్టర్ మనోజ్ కుమార్ అరోరా ప్రారంభించారు. సదస్సుకు ఆరు దేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన 36 మంది శాస్త్రవేత్తలు హాజరై యాంటీ బయాటిక్స్ వాడకం, వ్యాధి నిరోధకత, వివిధ రోగాల నివారణపై చర్చించారు. అనంతరం మంగుళూరు నిట్టే యూనివర్శిటీ ఏఎంఆర్ ఇన్సైట్స్, నెదర్లాండ్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త డాక్టర్ బుర్రి రంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల సలహా తీసుకుని మాత్రమే యాంటీ బయాటిక్స్ వాడాలన్నారు. మితిమీరిన యాంటీ బయాటిక్స్ వల్ల శరీరం విషతుల్యమయ్యే ప్రమాదముందన్నారు. అనంతరం బుక్లెట్ ఆవిష్కరించారు.కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ జయశీలన్ మురుగయ్యన్, డాక్టర్ సుదర్శన్ గోవింద రాజన్, ప్రొఫెసర్లు వాన్దొంగెన్, డాక్టర్ ఇంద్రాణి కరుణసాగర్, డాక్టర్ రంజిత్ థాఫా, డాక్టర్ ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
Related news
Related News by category
-
రేపు బలసాని కిరణ్కుమార్ నామినేషన్
గుంటూరురూరల్: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు. నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు. ఏలూరి కో–ఆపరేటివ్ బ్యాంక్ శాఖ ప్రారంభం తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ, తెనాలి చైర్మన్ డి.ఎల్. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్, బ్యాంక్ డైరెక్టర్ దత్త వెంకట కిరణ్ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్ను ప్రారంభించినట్టు చైర్మన్ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్, చీఫ్ మేనేజరు ఎం.వి.ఆర్ శేషుకుమార్, రవిమోహన్ పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. 11వ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాస్ తెనాలిరూరల్: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కమిటీని పరిచయం చేశారు. -
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్, ఆలా మహేష్, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్ మదరసా (షఫి), షేక్ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ విభాగం కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్, కొరగంటి ఉదయ్రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్కుమార్, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్కుమార్, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్, టి.నరసింహారావు, ఎస్.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్, కె.విజయ్, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్బాబు, మురికిపూడి రమేష్, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షురాలిగా వెంకటరమణి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. -
పెమ్మసానిపై చర్యలు తీసుకోండి
నెహ్రూనగర్: టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేసే క్రమంలో రజకులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాత్రి పట్టాభిపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్న సమయంలో లౌడ్ స్పీకర్స్లో రజకులను కించపరిచే విధంగా పలుమార్లు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. రజకులను చాకలి అని అనకూడదని..అలా అంటే చర్యలు తీసుకోవాలని టీడీపీ హయాంలో ప్రత్యేకంగా జీఓ జారీ చేసిందన్నారు. కానీ రజకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ పెమ్మసాని కనీసం ఖండించకపోవడం బాధాకరమన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 63వేల ఓటింగ్ ఉన్న రజకులను కించపరిచిన పెమ్మసానికి రజకుల ఓటుతో తగిన బుద్ధి చెబుతామన్నారు. మాజీ ప్రభుత్వ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రజకులను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టాభిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అన్నదాన సత్రం చైర్మన్ పోకల వసంత్ రజక సామాజిక వర్గం అని చెప్పుకుని టీడీపీ తరుపున టికెట్ తెచ్చుకున్న గల్లా మాధవి.. అదే రజక సామాజిక వర్గాన్ని దూషిస్తుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఖండించకపోతే భవిష్యత్తులో రజకులకు ఏం న్యాయం చేయగలరని అన్నారు. ఈ విషయంపై పెమ్మసాని చంద్రశేఖర్ రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు టీడీపీ నాయకులు రజకులను దూషించిన అంశాన్ని కరపత్రాల రూపంలో రజకుల ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు. రజక సంఘాల నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, రామరావు, దుర్గ, బద్రినాథ్, గౌరి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. రజకులను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు 63 వేల ఓట్లు ఉన్న రజకులంతా కలిసి బుద్ధి చెబుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీడీపీ లోక్సభ అభ్యర్థిపై చంద్రశేఖర్పై పోలీసులకు ఫిర్యాదు -
ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్
గుంటూరువెస్ట్: గుంటూరు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని, రవిశంకర్ పెమ్మసాని నామినేషన్ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్ పీపుల్స్ పార్టీ), షేక్ ఖాజావలి (ఇండిపెండెంట్), మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. క్షమాపణలు చెప్పిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు. పోలీసులపై దురుసు ప్రవర్తన పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్కుమార్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. -
పదిలో మెరిసిన బాలికలు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్లు, ఐఎఫ్పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే టెన్త్ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్కు చెందిన తమలపాకుల అభినవ్ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్గా నిలిచాడు. గుంటూరు రూరల్ యనమదల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు షేక్ రిహానా 583, షేక్ సమ్రీన్ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫాతిమా తబసుమ్ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్ మొహమ్మద్ (బీఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్ (ఎస్ఆర్ఎస్ మున్సిపల్ హైస్కూల్, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement