Sakshi News home page

15న పొన్నూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర

Published Sun, Nov 12 2023 1:48 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య   - Sakshi

పొన్నూరు: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల్ని వివరించేందుకు నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర ఈనెల 15న పొన్నూరులో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య తెలిపారు. శనివారం పొన్నూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్‌, హాఫీజ్‌ఖాన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు, సినీ నటుడు అలీ పాల్గొంటారని తెలిపారు. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, ఇరిగేషన్‌ బోర్డు డైరెక్టర్‌ దాసరి నారాయణరావు, మైనార్టీ కమిషన్‌ సభ్యుడు షేక్‌ సైఫుల్లా, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్‌, మండల అధ్యక్షుడు రుద్రపాటి ఆదిశేషులు, సర్పంచ్‌ బి.వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య

Advertisement

What’s your opinion

Advertisement