తక్షణమే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

తక్షణమే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

Published Thu, Dec 7 2023 1:24 AM

- - Sakshi

తాడికొండ: మిచాంగ్‌ తుఫాన్‌ వల్ల ఏర్పడిన విద్యుత్‌ అంతరాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్లు సీఆర్డీఏ విద్యుత్‌ సర్కిల్‌ ఎస్‌ఈ డాక్టర్‌ పి.విజయ్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్డీఏ సర్కిల్‌ పరిధిలోని 12 మండలాలు, మున్సిపాలిటీలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగిందని, వీటన్నింటినీ ఏపీ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మ జనార్దన్‌ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్‌ తీరం దాటిన 18 గంటల్లోపే మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. అతి తక్కువ సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనాలు రూపొందించి ఏపీసీపీడీసీఎల్‌ సంస్థకు సమర్పించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement