25న వైష్ణోదేవి విశాల్‌ జాగరణ్‌ | Sakshi
Sakshi News home page

25న వైష్ణోదేవి విశాల్‌ జాగరణ్‌

Published Thu, Mar 23 2023 4:30 AM

పూజలు చేస్తున్న జాగరణ్‌ మండలి సభ్యులు    - Sakshi

గన్‌ఫౌండ్రీ: ఈ నెల 25న గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో వైష్ణోదేవి విశాల్‌ జాగరణ్‌ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు జాగరణ్‌ మండలి చైర్మన్‌ అంజనీకుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. బుధవారం గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో జాగరణ్‌ మండలి సభ్యులు భూమి పూజ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవజాతి శ్రేయస్సు కోసం, శాంతి ప్రోత్సహించాలనే కర్తవ్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారని వెల్లడించారు. దాదాపు 20 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోర్‌కమిటీ సభ్యులు రాంకిషన్‌ అగర్వాల్‌, సంజయ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement