డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌కు డాక్టరేట్‌ | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌కు డాక్టరేట్‌

Published Thu, Nov 9 2023 6:00 AM

సంతోష్‌ కుమార్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై   - Sakshi

లక్డీకాపూల్‌: ఐడీబీఐ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ డి.సంతోష్‌ కుమార్‌కు నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గృహ రుణాలపై పరిశోధన పూర్తి చేసినందుకు వర్శిటీ చాన్స్‌లర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పీహెచ్‌డీని ప్రదానం చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ మిర్యాల మార్గదర్శకత్వంలో ఆయన పరిశోధన పూర్తి చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవంలో భాగంగా వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌ రెడ్డి స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు.

ఉమ్రా యాత్రికులకు ఆత్మీయ స్వాగతం

శంషాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఇటీవల ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులు బుధవారం యాత్ర ముగించికుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారికి ఎయిర్‌పోర్టు వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. యాత్రను అల్‌మిజాన్‌ సంస్థ అధ్యక్షుడు ఫయాజ్‌ అలీ పర్యవేక్షించారు.

హైదరాబాద్‌కు చేరుకున్న ఉమ్రా యాత్రికులు
1/1

హైదరాబాద్‌కు చేరుకున్న ఉమ్రా యాత్రికులు

Advertisement
Advertisement