Sakshi News home page

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు

Published Thu, Dec 21 2023 4:26 AM

మామిడిపల్లిలోని ప్రభుత్వ భూమిలో ప్రారంభమయిన అక్రమ నిర్మాణాలు  - Sakshi

పహడీషరీఫ్‌: బాలాపూర్‌ మండల పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మండల పరిధిలోని జల్‌పల్లి గ్రామంలోని 223 సర్వే నంబర్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములలో నిర్మాణాలు కొనసాగుతుండగా..తాజాగా మామిడిపల్లిలో కూడా కబ్జాల పర్వం ఆరంభమైంది. సర్వే నంబర్‌ 99/1లో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల పేరుతో జీవో నంబర్‌ 59ను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ ఏకంగా ఓ కాలనీనే నిర్మించుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో గజం రూ.40–50 వేలు పలుకుతున్న తరుణంలో ప్రభుత్వ భూములపై తమకెందుకు హక్కు ఉండదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన ప్రభుత్వ భూమిలో ఎవరికి తోచిన విధంగా వారు కంచెలు ఏర్పాటు చేసుకోవడం, హద్దురాళ్లు పాతుకోవడం ప్రారంభించారు. రెండు రోజులుగా ఈ విషయమే గ్రామంలో హాట్‌ టాఫిక్‌గా మారింది. రెవెన్యూ అధికారులు ఇకనైనా మేల్కొని కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై బాలాపూర్‌ తహసీల్దార్‌ మాధవీరెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు.

Advertisement

What’s your opinion

Advertisement