లండన్‌లో కత్తిపోట్లతో భారతీయుడు దుర్మరణం | Sakshi
Sakshi News home page

లండన్‌లో కత్తిపోట్లతో భారతీయుడు దుర్మరణం

Published Mon, Jun 19 2023 5:55 AM

Indian-origin man stabbed to death in UK - Sakshi

లండన్‌: దక్షిణ లండన్‌లో భారతీయుడు ఒకరు వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. కేరళకు చెందిన అరవింద్‌ శశికుమార్‌ (38)ను సౌత్‌వార్క్‌లో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న శశికుమార్‌ ఆస్పత్రికి తరలించే లోపు  మరణించినట్టు పోలీసులు తెలిపారు.

సల్మాన్‌ సలీమ్‌ (25) అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తేజస్విని రెడ్డిని కత్తితో పొడిచి చంపిన మూడు రోజుల్లోనే మరొక భారతీయుడు అదే విధంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement