Telangana Crime News: TS Crime News: నిన్న వేడుక.. ఈరోజు ఇలా.. తీవ్ర విషాదం!
Sakshi News home page

TS Crime News: నిన్న వేడుక.. ఈరోజు ఇలా.. తీవ్ర విషాదం!

Published Fri, Aug 25 2023 12:04 AM

- - Sakshi

ఖమ్మం: పాప పుట్టిన ఆనందంలో ఆ కుటుంబం బారసాల వేడుకగా నిర్వహించారు. అంతకుముందు కుమారుడు ఉండడంతో ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడపొచ్చని అనుకున్నారు. కానీ ఆటో రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇంట విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు రేళ్లపాడు రాజీవ్‌ నగర్‌కు చెందిన భరత్‌కుమార్‌, వేంసూరు మండలం రాయుడుపాలెంకు చెందిన దివ్య వివాహం చేసుకున్నారు.

భరత్‌ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరికి రెండేళ్ల కుమారుడు దర్షిత్‌ ఉన్నాడు. తాజాగా మరో కుమార్తె జన్మించడంతో పాపకు రాయుడుపాలెంలో బుధవారం బారసాల వేడుక నిర్వహించారు. కాగా, గురువారం ఉదయం దర్షిత్‌ రోడ్డు పక్కన ఆడుకుంటుండగా అజాగ్రత్తగా ఉల్లిపాయల ఆటో నడిపిన డ్రైవర్‌ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్షిత్‌ను సత్తుపల్లి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాయుడుపాలెం ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement