స్టేషన్ఘన్పూర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించబడిన పీఓలు, ఏపీఓలకు ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేసేందుకు డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో డి.హేమంత్కుమార్ అనే ఉద్యోగికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్కు చెందిన హేమంత్కుమార్ జనగామలో విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హేమంత్కు ఘన్పూర్ నియోజకవర్గంలో ఏపీఓగా నియమించారు. ఈవీఎంల పంపిణీ కేంద్రానికి హాజరైన హేమంత్కుమార్ మధ్యాహ్నం ఫిట్స్కు గురయ్యాడు. వెంటనే గమనించిన తోటి అధికారులు 108 అంబు లెన్స్కు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది హరికృష్ణ, రాజన్న సకాలంలో స్పందించి అతడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
భూపాలపల్లి నుంచి ఎన్నికల సామగ్రితో వెళ్తున్న సిబ్బంది