‘సాక్షి’ పత్రిక ద్వారా వెలుగులోకి..
ఐసీడీఎస్ శాఖలో మెడికల్ ఆఫీసర్గా నియామకమై పని చేయకుండా ఏడేళ్ల పాటు జీతం తీసుకున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చి ప్రచురించింది. దీంతో రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగానికి తెరపడింది. ఎప్పటికప్పుడు నిజాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ దినపత్రికకు అభినందనలు. – శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
నాగర్కర్నూల్లో కొంతమంది అర్హత లేకున్నా వైద్యుల పేరుతో ఆస్పత్రులను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరుపై 2022 జూలై 13న ‘శంకర్దాదాలు’ శీర్షికన వార్తా కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్యశాఖ అధికారులు జిల్లాకేంద్రంలో అనుమతులు లేకుండా, ఆర్ఎంపీలునిర్వహిస్తున్న క్లినిక్లపై తనిఖీలు చేపట్టి పలు ఆస్పత్రులను సీజ్ చేశారు.