తిండి కలిగినంత మాత్రాన ‘కండ’ కలదు... అనే విషయంలో గ్యారెంటీ ఏమీలేదు. తిండికి తగినట్లు తగిన వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ. లేనిచో ‘బొజ్జ కలదోయ్’ అనుకోవాల్సి వస్తుంది. ఫిన్నెస్పై శ్రద్ధ పెట్టడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మస్తు మంచిది అనే విషయం తెలిసినా చాలామంది ‘ఆ..ఈ వయసులో ఏంచేస్తాం లెండి’ అని తప్పించుకుంటుంటారు. కొందరేమో ‘బిజీ’ అంటూ సాకులు వెదుక్కుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ను చూడండి. అతని వయసు 65 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఏమిటీ’ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కసరత్తులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్న తన బాడీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖేర్. ‘ఎన్నడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని కామెంట్ కూడా పెట్టారు. అంతే కదా మరి!
Breadcrumb
సల్మాన్ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?
Published Tue, Mar 2 2021 2:18 PM
# Tag
Related News by category
-
అటు మోసం – ఇటు నమ్మకం
అటు మాటపై నిలబడని చంద్రబాబు.. ఇటు మాటపై నిలబడే సీఎం జగన్ కూటమిది మాయఫెస్టో..👉 మాటలతో మభ్యపెట్టి లబ్ధి పొందడమే చంద్రబాబు అజెండా 👉 మేనిఫెస్టో అంటే బాబు దృష్టిలో చిత్తు కాగితం 👉 ఎన్నికలప్పుడు అలవికాని హామీలు..ఆ తర్వాత చెత్తబుట్టలో వేయడం బాబు నైజం 👉 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టుకట్టి 650 హామీలు ఇచి్చన బాబు 👉 అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచిన వైనం 👉 రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా రైతులకు టోపీ 👉 రూ.25,570.90 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలకు మోసం 👉 ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకురూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ యువతకు వంచన2014 ఎన్నికల తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీలతో జట్టుకట్టి అలవికాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటక, తెలంగాణల్లోవిఫలమైన పథకాలకు సూపర్ సిక్స్ ముసుగు వైఎస్సార్సీపీది మేనిఫెస్టో👉 మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా చూస్తున్న సీఎం జగన్ 👉 అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తున్న జననేత 👉 విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది జగన్ సిద్ధాంతం 👉 ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం జగన్ విధానం 👉 2019లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ 👉 అధికారంలోకి వచి్చన తొలి ఏడాదే 95 శాతం.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు 👉 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ 👉 నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం 👉 ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత 👉 2024 ఎన్నికల మేనిఫెస్టోను రెండు పేజీలతో విడుదల చేసిన సీఎం జగన్ 👉 జగనన్న అమ్మ ఒడి కింద ఇస్తున్న సొమ్ము రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు 👉 వైఎస్సార్ రైతు భరోసా కింద చేస్తున్న సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు 👉 వృద్ధాప్య పెన్షన్ రూ.3 వేల నుంచి రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతానని హామీచంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, 1995లో అధికారంలోకి వచి్చన బాబు.. 94 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం హామీలను తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, రూ.2 కే కిలో బియ్యాన్ని రూ.5.50కి పెంచి ప్రజలను మోసం చేశారు. 1999 ఎన్నికల్లోనూ అదే కథ. కోటి మందికి ఉపాధి కల్పిస్తానని, 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. సాక్షి, అమరావతి: మేనిఫెస్టో అంటే ప్రజలకు నాయకుడు ఇచ్చే మాట.. పారీ్టకి, ప్రజలకు మధ్య ఒప్పంద పత్రం.. నాయకుడికి, ప్రజలకు మధ్య బంధం. అందుకే మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా పవిత్రంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తారు. విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది ఆయన సిద్ధాంతం. అందుకే అమలు చేయదగిన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. 2014, 2019, 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలే అందుకు నిదర్శనం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తద్భిన్నం. ఎన్నికలప్పుడు అలవికాని హామీలతో.. అబద్ధాలకు రెక్కలు కడుతూ మేనిఫెస్టోను విడుదల చేయడం, అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కడం, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల మేనిఫెస్టో అమలే అందుకు తార్కాణం. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన చంద్రబాబు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ సహా అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సమయంలో రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ ప్రకటించాలని సీఎం జగన్కు సన్నిహితులు సూచించినా.. దాన్ని అమలు చేయలేమని, అలాంటప్పుడు ఆ హామీ ఇవ్వలేనని తేల్చిచెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో సీఎం జగన్ అధికారంలోకి రాలేకపోయారు. అప్పుడు అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు. వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేశారు. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరి కొత్త నిర్వచనం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆరి్థక ఇబ్బందులు ఉత్పన్నమైనా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు.2014 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు. 2019 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచి్చన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక దానిపై విస్తృతంగా అధ్యయనం చేసి.. పదవీ విరమణ అయ్యే నాటికి చివరి నెల జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్ను తెచ్చారు. హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండే రెండు పేజీలతో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతానని.. రైతు భరోసా కింద ఏటా ఇస్తున్న రూ.13,500ను రూ.16 వేలకు పెంచుతానని.. వృద్ధాప్య పెన్షన్ను రూ.3 వేల నుంచి రెండు దశల్లో రూ.3,500కు పెంచుతానని కొత్తగా హామీలు ఇచ్చారు. కానీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2014 తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. తెలంగాణ, కర్ణాటకల్లో విఫలమైన పథకాలకే సూపర్ సిక్స్ ముసుగేసి అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని భావించే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇచ్చిన మాటపై నిలబడే సీఎం జగన్ ఓ వైపు.. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర ఎన్నడూ లేని చంద్రబాబు మరో వైపు.. ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే. -
లాల్ చౌక్లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!
దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం శ్రీనగర్లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.అల్తాఫ్ ఘంటాఘర్, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్, సిమెంట్ కడల్, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదానికి బలైన తెనాలికి చెందిన గొల్తి గీతాంజాలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం అండగా నిలిచింది. ఆమె ఇద్దరు పిల్లలు రిషిత(10), రుషిక(6) పేర్లతో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను బ్యాంక్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. డిపాజిట్ పత్రాలను శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి భర్త గొల్తి బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికకు అందజేశారు. పిల్లలను బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా వైఎస్సార్ సీపీని సంప్రదించాలని బాలచందర్కు సజ్జల సూచించారు. బాలచందర్ మాట్లాడుతూ గీతాంజలి చనిపోయిన కొన్ని గంటల్లోనే సీఎం వైఎస్ జగన్ స్పందించి బతుకుపై తమ కుటుంబానికి భరోసా కల్పించారని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుల్రెడ్డి ఆధ్వర్యాన ఎ.సురేంద్రరెడ్డి, యూకేలోని వైఎస్సార్సీపీ విభాగం సభ్యులు అందరూ కలిసి మా పిల్లల పేరు మీద రూ.20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు అందజేశారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మధు, ఎన్ఆర్ఐ కాశీపతి పాల్గొన్నారు. -
రూ.300 పింఛన్ను రూ.400 చేస్తా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.300 పింఛన్ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్ నాలుక కరుచుకున్నారు. -
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
సాక్షి, అమరావతి: ‘హైకోర్టుకన్నా మీరే ఎక్కునుకుంటున్నారా? సంక్షేమ పథకాల నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు’అంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం నిప్పులు చెరిగింది. ‘2019లో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల విడుదలకు అనుమతిచ్చారు. మొన్న తెలంగాణలో రైతు బంధు పథకానికి అనుమతించారు. ఇక్కడా అనుమతి కోరింది పాత పథకాలకే కదా! అప్పుడు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవకు అనుమతిచ్చిన వాళ్లు ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వరు ’అని గట్టిగా నిలదీసింది. సంక్షేమ పథకాల అమలుకు అనుమతినిచ్చే విషయంలో ఈసీ తీరు ఆందోళన కలిగిస్తోందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ‘నిధుల పంపిణీకి బ్రేక్ వేస్తూ మీరు ఇచి్చన ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్లో పెట్టిన తరువాత కూడా నిధుల పంపిణీకి ఎన్వోసీ ఇవ్వకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మండిపడింది. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా నిధుల పంపిణీ చేయకూడదని చట్టం ఏదైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘సింగిల్ జడ్జి తీర్పుపై ఎన్నికల సంఘం అప్పీల్ చేసిందా? ఎన్నికల సంఘానికి లేని అభ్యంతరం మీకెందుకు’అని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ రాష్ట్రంలోని పేదల అభ్యున్నతికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల్లో కొన్నింటికి నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. పోలింగ్ ముగిసే వరకు నిధుల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశాలివ్వడంతో నిధుల పంపిణీ ఆగిపోయింది. ఈసీ నిర్ణయంపై పలువురు రైతులు, మహిళలు, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి ఈనెల 10 వరకు ఈసీ ఉత్తర్వులు అమలు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటునిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయకుండా, ఎన్వోసీ జారీ చేయకుండా ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ నవతరం పార్టీ ధర్మాసనం ముందు 4 అప్పీళ్లు దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఎలా అసాధారణం? ఈ అప్పీళ్ల గురించి నవతరం పార్టీ తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన నాదకర్ణి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నిధుల పంపిణీకి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై తక్షణమే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అందరి వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి రాత్రి 10.35 గంటల సమయంలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేశారని నాదకర్ణి అనగా.. ఎలా అసాధారణం అవుతాయని ధర్మాసనం గట్టిగా ప్రశ్నించింది. ‘సంక్షేమ పథకాల నిధులనే కదా సింగిల్ జడ్జి పంపిణీ చేయవచ్చని చెప్పింది. అందులో తప్పేముంది? ఆ పథకాలు పాతవే కదా ’అని వ్యాఖ్యానించింది. ఇవి రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలు.. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, సంక్షేమ పథకాల కింద నిధుల పంపిణీకి వీల్లేదని నాదకర్ణి అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘నియమావళి అమల్లో ఉండగా, పథకాలు అమలుకు ఈసీ అనుమతులు తప్పనిసరా? ఏ చట్టంలో ఉందో చెప్పాలి’అనగా.. నాదకర్ణి ఎన్నికల నియమావళి గురించి చెప్పడం మొదలు పెట్టారు. ధర్మాసనం కలి్పంచుకొని.. ‘ఈసీ ఏదైనా ఉత్తర్వులిస్తే కోర్టులు ఏమీ చేయకూడదంటారా? కోర్టులకన్నా ఈసీ ఎక్కువని భావిస్తున్నారా?’అంటూ నిలదీసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న పథకాలు పాతవని, రాష్ట్రంలో చాలా పాపులర్ పథకాలని ధర్మాసనం గుర్తు చేసింది. తెలంగాణలో రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతినిచి్చన విషయాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే నిధుల పంపిణీ జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు అనుమతించరని నిలదీసింది. మా అధికారులనే బెదిరిస్తారా? ఈ అప్పీల్ దాఖలులో నవతరం పార్టీ న్యాయవాదుల తీరుపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ వేయాలంటూ ఫోన్ చేసి మా రిజిస్ట్రీని, మా అధికారులనే బెదిరిస్తారా? తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తారా?’అంటూ గట్టిగా నిలదీసింది. ‘మీ దెబ్బకు రిజిస్ట్రీ నాకు ఫోన్ చేసింది. ఉదయాన్ని లేచి చూస్తే రిజిస్ట్రీ నుంచి నా ఫోన్కు మెసేజ్లతో పాటు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా రిజిస్ట్రీని మీరు ఉదయం 5 గంటలకే నిద్ర లేపుతారా? అంత ఉదయాన్నే నిద్ర లేచి మీ సేవలో ఉండాలని భావిస్తున్నారా? మేము ఆ సమయంలో నిద్ర లేచి మీ పిటిషన్ను హౌస్మోషన్ రూపంలో విచారించాలని భావిస్తున్నారా’అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంకా నయం తనకు నేరుగా ఫోన్ చేయలేదని సీజే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? అనంతరం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగింది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మీరు అభ్యంతరం చెప్పలేదు. మీకు అభ్యంతరం ఉంటే మా ముందు అప్పీల్ చేసేవారు. అప్పీల్ చేయనప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయాలి. అప్పీల్ వేయకుండా సింగిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండటం ఏమిటి? మీ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలను వారి సొమ్ము వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉన్న వారందరికీ సమాన అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) కల్పించేందుకే పథకాల అమలును ఆపామని మీరు చెబుతున్నారు. కానీ గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు బంధు పథకాలకు అనుమతినిచి్చ, ఇప్పుడు ఇక్కడ పథకాలను ఆపడం ద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదన్న విషయాన్ని మీరే రుజువు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో మీరు ఇలాగే ప్రభుత్వ పథకాలను ఆపుతున్నారా’అంటూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కో రకంగా..అసలు నిధుల పంపిణీ సంగతి ఏమిటని ధర్మాసనం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ను ధర్మాసనం ప్రశ్నించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి సింగిల్ జడ్జి అనుమతినిచి్చన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేశారన్నారు. నిధుల పంపిణీకి ఎన్వోసీ జారీ చేయాలని కోరారన్నారు. ఎన్వోసీ విషయాన్ని తేల్చని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయింపులు, పథకాలు అమలవుతున్న తేదీల వివరాలను అడుగుతూ సీఎస్కు లేఖ పంపిందని వివరించారు. ఎన్ఈవోసీ విషయాన్ని ఏం చేసిందో ఈసీనే అడగా లని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ఎన్నికల సంఘం తీరు ఒక్కో ప్రభుత్వం విషయంలో ఒక్కోరకంగా ఉంటోందన్నారు. గతంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు అనుమతిచి్చందని, ఇందుకు పాత పథకాలన్న కారణం చెప్పిందన్నారు. ఇప్పుడు తాము కూడా పాత పథకాలనే అమలు చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెబుతోందన్నారు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా? దీంతో ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరణను ధర్మాసనం కోరింది. నిధుల పంపిణీ వద్దంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా నిధులు పంపిణీ చేసుకోవచ్చని చెప్పలేదని అవినాష్ దేశాయ్ అనగా.. ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘మీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి అబయన్స్లో పెట్టిన తరువాత ఆ ఉత్తర్వులు అమలు చేయడమే మీ పని. కానీ మీరేం చేశారు? కోర్టుకన్నా మీరు ఎక్కువని అనుకుంటున్నారా’అంటూ ప్రశ్నించింది. ‘ఈసీ ఇలాగే ప్రతి పథకాన్ని అడ్డుకోవచ్చా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు, వేరే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావొచ్చు. ఈసీ పరిధి దాటి వ్యవహరిస్తోందా అన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న’అని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఈ అప్పీళ్లపై విచారణ జరిపి, సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలించి, తాము నిర్ణయించిన మేరకు ఉత్తర్వులిచి్చ, ఆ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి వచ్చేసరికి రాత్రి అవుతుందని తెలిపింది. బ్యాంకుల పని వేళలు సాయంత్రంతో ముగుస్తాయని, అలాంటప్పుడు ఈ నెల 10న నిధుల పంపిణీ ఎలా సాధ్యమవుతందని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో తాము ఈ అప్పీళ్లపై ఇప్పటికిప్పుడు తేల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపింది. ఎన్నికల సంఘం వల్లే నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదు దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఈసీ అమలు చేయకపోవడం వల్ల, ఎన్ఈవోసీ ఇవ్వకపోవడం వల్ల నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఏజీ శ్రీరామ్ వివరించారు. ఈ అప్పీళ్లను ఇప్పటికిప్పుడు తేల్చకపోయినా, ఈసీ తీరును మాత్రం ఖచి్చతంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చా అన్న విషయాన్ని తేల్చాలని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ‘14వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని మీరు (ఎన్నికల సంఘం) చెబుతున్నారు. అప్పుడైనా నిధుల పంపిణీకి అనుమతిస్తారా లేక ఇలాగే ఆ వివరాలు, ఈ వివరాలు కావాలని అడుగుతూ వెళ్తారా’అంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. అలాంటిది ఏమీ లేదని, 14 నుంచి నిధులు పంపిణీ చేసుకోవచ్చని ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈసీ అనుమతి ఇవ్వని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదని, అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఉత్తర్వులిచ్చింది. ఈ అప్పీళ్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 2న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.మోకాలడ్డింది చంద్రబాబే! ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు నక్కజిత్తులు మరోసారి బయటపడ్డాయి. నవతరం పార్టీతో పిటిషన్లు దాఖలు చేయించడం ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థులకు సంక్షేమ నిధులు అందకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు మరోమారు మోకాలడ్డారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం రూ.14,165 కోట్లు శుక్రవారం లబి్ధదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేరుగా కోర్టును ఆశ్రయిస్తే ప్రజల్లో ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు దొడ్డిదారిని వెతుక్కున్నారు. తనతో సన్నిహితంగా ఉండే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అనే అనామక పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంతో హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయించారు. అంతేకాక ఒక్క రోజు వాదనలకు రూ.20 లక్షల వరకు వసూలు చేసే మీనాక్షి అరోరా (రామోజీరావు తరపున మార్గదర్శి కేసుల్లో హాజరయ్యే న్యాయవాది), దేవ్దత్ కామత్ (రాజధాని కేసులో న్యాయవాది), ఎస్.నాదకర్ణి నవతరం పార్టీ తరపున వాదనలకు దించారు. ఇంత ఖరీదైన లాయ ర్లను పెట్టుకొనే స్థోమతు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు లేదు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ, వాదనలతో సాయంత్రం అయిపోయింది. దీంతో ని ధుల విడుదలపై సింగిల్ జడ్జి ఇచి్చన గడువు ముగిసిపోయింది. ఫలితంగా ప్రభుత్వం నగ దు విడుదల చేసినప్పటికీ లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేయలేకపోయింది. చంద్రబాబు చేసిన ఈ పాపానికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీకి రెండు చోట్ల గాజు గ్లాసు గుర్తు వచ్చింది. దీంతో ఆయన చంద్రబాబును కలిసి లోపాయికారీ ఒప్పందం ప్రకారం ఎన్నికల నుంచి తప్పుకున్నారు. పైగా టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా తన సంపూర్ణ మద్దతును టీడీపీకి ప్రకటించడం గమనార్హం.
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement