థాయ్‌లాండ్‌లో డబుల్‌  | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో డబుల్‌ 

Published Mon, Aug 14 2023 12:32 AM

Double Smart started the second schedule in Thailand - Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019) వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత హీరో రామ్‌ పొతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్‌.  ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌లోప్రారంభించాం.

ఈ షెడ్యూల్‌లో రామ్, నటుడు సంజయ్‌ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి.

Advertisement
Advertisement