Sakshi News home page

Chiranjeevi : సీఎంతో భేటీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Feb 10 2022 11:28 AM

Megastar Chiranjeevi Sensational Comments At Airport About Tollywood Meeting Goes Viral - Sakshi

Megastar Chiranjeevi Sensational Comments: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్రముఖుల సమావేశంపైనే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చిస్తుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, ప్రభాస్‌ సహా ఇతర ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినిమా టికెట్ల ధర సహా మొత్తం 17 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా భేటికి హాజరుకానున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

'నాకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. మిగతా ఎవరు వస్తారో తెలియదు. మీడియాలో చూసి తెలుసుకుంటున్నా' అని పేర్కొన్నారు. ఈ భేటీతో ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్‌ పడుతుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే సినీ ప్రముఖుల భేటీ విషయంలో ఎవరెవరు పాల్గొంటారో తెలిదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Advertisement
Advertisement