జూలై ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర | Sakshi
Sakshi News home page

జూలై ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

Published Sat, Apr 15 2023 6:25 AM

Amarnath Yatra To Begin On July 1 - Sakshi

జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్‌ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్‌ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement