ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జడ్జి | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జడ్జి

Published Sun, Aug 27 2023 12:52 AM

సరుకులను పరిశీలిస్తున్న జడ్జి  - Sakshi

నిర్మల్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఈద్గాం ఆశ్ర మ బాలికల గిరిజన పాఠశాలను జిల్లా జడ్జి కర్ణకుమార్‌ ఆదేశాల మేరకు జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. బోధకాలు నివారణ మాత్రలు వేసుకోవడంతో పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అజయ్‌కుమార్‌ పాఠశాలలోని హాస్టల్‌ గదులను పరిశీలించా రు. బియ్యం, పప్పు దినుసులు ఇతరత్రా సా మగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమై న భోజనం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అస్వస్థత చెందిన విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలు సుకున్నారు. ఆయన వెంట సిబ్బంది రాజలింగం, లింగగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement