ఈవీఎంల పనితీరుపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

ఈవీఎంల పనితీరుపై అవగాహన అవసరం

Published Wed, Nov 22 2023 12:14 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌
 - Sakshi

● ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ● నిర్మల్‌ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

ఉట్నూర్‌రూరల్‌: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పీవో, ఏపీవోలు ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని నిర్మల్‌ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో పీవో, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. ఈవీఎం, వీవీప్యాట్‌, హ్యాండ్‌ బుక్‌, పోలింగ్‌ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ మొదలుకొని పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోల్‌ నిర్వహించాలన్నారు. తర్వాత ఆ సమాచారం మొత్తం క్లియర్‌ చేసుకోవాలన్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభించాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్‌ రూమ్‌, కమిషనింగ్‌ రూమ్‌లను పరిశీలించి బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్వో జీవాకర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.

Advertisement
Advertisement