పీఆర్సీని వెంటనే ప్రకటించండి | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 4 2023 7:30 AM

నిరసన తెలుపుతున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులు 
 - Sakshi

నిజామాబాద్‌నాగారం: విద్యుత్‌శాఖ సిబ్బందికి వెంటనే పీఆర్సీ, ఈపీఎఫ్‌ టూ జీపీఎఫ్‌ ప్రకటించాలని జిల్లా జేఏసీ కన్వీనర్‌ రేంజర్ల బాలేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఎదుట శుక్రవారం స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ పిలుపుమేరకు విద్యుత్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 8నుంచి నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయని, పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలిరావాలని కోరారు. జేఏసీ నాయకులు రాజేందర్‌, 1104 అధ్యక్షులు, కోచైర్మన్‌ గంగాధర్‌, కోకన్వీనర్‌ తోటరాజశేఖర్‌, కాశీనాథ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement