మన్మథస్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

మన్మథస్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభం

Published Tue, Nov 14 2023 12:58 AM

సుంకిని సిద్ధేశ్వర స్వామితో వీరశైవులు  - Sakshi

బోధన్‌: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వీరశైవ జంగమ, లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కొలువైన వీరశైవుల ఆరాధ్యదైవం మన్మథ స్వామి పుణ్యక్షేత దర్శనానికి 14 వ మహాపాదయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని జంగమగల్లీలో ఉన్న వీరశైవుల పురాణే మఠంలో శివపార్వతులు, మన్మథస్వామి చిత్రపటాలకు సో మవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోట గిరి మండలంలోని సుంకినికి చెందిన వీరశైవుల గురువు సిద్ధేశ్వర స్వామి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడినుంచి ఏకచక్రేశ్వరాలయానికి చేరు కుని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. సమాజ్‌ ప్రతినిధులు కర్నె హన్మంత్‌రావు, నర్సింగ్‌ అప్ప, లక్ష్మణ్‌ పటేల్‌, సంతోష్‌ మహరాజ్‌, శంకరప్ప, రాజేందర్‌కుమార్‌, విఠలప్ప, పురాణే అజయ్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement