నాటుసారా, మద్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

నాటుసారా, మద్యం స్వాధీనం

Published Fri, Nov 10 2023 4:56 AM

నాటుసారా స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్‌ పోలీసులు - Sakshi

రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్‌ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బ్రాహ్మణపల్లి తండా నుంచి రామగుండం ఎస్టీ కాలనీకి ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంతో పాటు 12 లీటర్ల గుడుంబాను సీజ్‌ చేసి నిందితుడు సంపత్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి తండాలోని అటవీ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మరో 350 లీటర్ల బెల్లం పానకం నిల్వలను గుర్తించి ధ్వంసం చేశారు. అంతర్గాం మండల పరిధిలోని పలు బెల్ట్‌ షాపుల్లో సోదాలు నిర్వహించగా.. మద్యం కలిగి ఉన్న విక్రయదారులపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 3(1000ఎంఎల్‌), 78(180ఎంఎల్‌), 28(90ఎంఎల్‌), 4(కేఎఫ్‌ బీర్లు) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ సుంకరి రమేశ్‌ మాట్లాడుతూ.. గుడుంబా, మద్యం తయారు చేసి నిల్వలు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామన్నారు. ఎస్సైలు శారద, విజయభాస్కర్‌, సిబ్బంది ఖదీర్‌, ప్రసాద్‌, తిరుపతి, రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement