సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పుచేర్పులపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దృష్టి పెట్టారు. దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించని జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించినందున, వీటిలో 15 నుంచి 20 జిల్లాలకు చురుగ్గా పనిచేసే కొత్త అధ్యక్షుల నియామకం దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.
పలువురు జిల్లా అధ్యక్షులు దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగుతున్నందున పని తీరు, అప్పగించిన విధులు, బాధ్యతల నిర్వహణ, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పాత్ర తదితర అంశాల ప్రాతిపదికన మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టనున్నట్టు చెబుతున్నారు. శనివారం పార్టీనాయకులతో కిషన్రెడ్డి సమావేశమైన సందర్భంగా సంస్థాగత మార్పులకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టినట్టు సమాచారం.
ఇక కిషన్రెడ్డి టీం?
వచ్చే మార్చి, ఏప్రిల్లలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో...పకడ్బందీగా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు తన టీమ్ను నియమించుకునే దిశగా కిషన్రెడి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు పూరిస్థాయిలో సన్నద్ధం కావడంలో భాగంగా 17 ఎంపీ స్థానాల పరిధిలో పార్లమెంట్ కమిటీలను నియమించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలసమయంలో పార్టీ కోసం సరిగ్గా పనిచేయని వారు, బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు, దీర్ఘకాలికంగా జిల్లా అధ్యక్షులు, ఇతర బాధ్యతల్లో ఉన్న వారు, పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మార్చాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్లు...
శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన పలువురికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. వీరిలో ఇద్దరు ముగ్గురు జిల్లా అధ్యక్షులతో పాటు పదిమంది వరకు రాష్ట్రస్థాయి నాయకులు ఉంటారని తెలుస్తోంది. ఈ నోటీసులపై వారం, పదిరోజుల్లో వివరణ అందాక ఆరోపణల తీవ్రతను బట్టి సస్పెన్షన్లు, ఇతర చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
శనివారం పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ ఎం.ధర్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్, సభ్యులు నాగూరావు నామాజీ, పద్మజా రెడ్డి, బోసుపల్లి ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకులపై వచి్చన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది.
TS: బీజేపీలో15 మంది జిల్లా అధ్యక్షుల మార్పు?
Published Sun, Dec 31 2023 4:49 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement