Sakshi News home page

'ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర..' డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..

Published Mon, Jul 24 2023 9:32 PM

Conspiracy Hatched Topple Congress Govt in Karnataka - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అనేక సంక్షేమ పథకాలను అమలుపరిస్తూ సరికొత్త ఒరవడితో సిద్ధరామయ్య నేతృత్వంలో ముందుకు వెళుతోంది. అయితే.. తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని అన్నారు. ఇందుకు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు.

బెంగళూరుకు బయట ఈ కుట్ర జరుగుతోందని శివకుమార్ చెప్పారు. ఇది ఎవరి వ్యూహమో తమకు తెలుసని భాజపాను ఉద్దేశించి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

డీకే వ్యాఖ్యలను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా సమర్థించారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోశారని భాజపాను ఉద్దేశించి అన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వాలను కూల్చడంలో భాజపాకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.  

ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్‌

Advertisement

What’s your opinion

Advertisement