Eluru: జనసేనలో ప్రకంపనలు.. జన సైనికులు నిరసన | Sakshi
Sakshi News home page

Eluru: జనసేనలో ప్రకంపనలు.. జన సైనికులు నిరసన

Published Wed, Feb 28 2024 5:03 PM

Janasena Leaders Protest At Janasena Party Office In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు: టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నాడే జనసేనలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు నిరసనకు దిగారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభను ఏలూరు జనసేన నాయకులు బాయ్‌ కాట్‌ చేశారు. నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు పెట్టకుని నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు చేశారు.

మరోవైపు, తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం సభకు కృష్ణాజిల్లా నేతలు డుమ్మా కొట్టారు. సభకు దూరంగా అవనిగడ్డ టీడీపీ శ్రేణులు ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్‌పై స్పష్టత ఇవ్వనందుకు సభను టీడీపీ క్యాడర్‌ బాయ్ కాట్ చేసింది. పెడన టిక్కెట్ టీడీపీకి కేటాయించడంతో  జనసేన నేతలు,శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి సభకు పెడన జనసేన నేతలు,కార్యకర్తలు డుమ్మాకొట్టారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement