చాత్తాద శ్రీవైష్ణవ సంఘం కార్యవర్గం ఎన్నిక | Sakshi
Sakshi News home page

చాత్తాద శ్రీవైష్ణవ సంఘం కార్యవర్గం ఎన్నిక

Published Thu, Mar 30 2023 4:20 AM

నూతన కార్యవర్గ సభ్యులు - Sakshi

నల్లకుంట: తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్‌ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడిగా టి.కొండస్వామి, వైస్‌ – ప్రెసిడెంట్‌ డి.మురళి, తోమాల వాణి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస స్వామి, సంయుక్త కార్యదర్శి టి.మురళి, సంప్రదాయ విభాగం సహాయ కార్యదర్శి ఎం.భాస్కరస్వామి, కోశాధికారిగా శ్రీధర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ నల్లకుంటలోని చాత్తాద వైష్ణవ సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగింది. తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కూర్మాచలం అనిల్‌కుమార్‌ హాజరయ్యారు. సంఘం ఎన్నికల అధికారులుగా కొండా వేణుమూర్తి, గజవల్లి సత్యనారాయణ, ధర్మపురి శ్రీనివాస్‌, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ వ్యవహరించారు. చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు అశ్వాపురం వేణుమాధవ్‌ తెలంగాణ ప్రభుత్వ చేయూతకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. చాత్తాద శ్రీవైష్ణవ సంఘం అధ్యక్షుడు టి.కొండస్వామి మాట్లాడుతూ భగవద్‌రామానుజుల స్ఫూర్తితో సమసమాజ నిర్మాణంలో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Advertisement
Advertisement