CWC 2023: భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌.. కొట్టుకున్న అభిమానులు | CWC 2023: Fight Breaks Out Between Fans In Delhi Stadium During Ind VS AFG World Cup 2023 Match, Video Viral - Sakshi
Sakshi News home page

Ind Vs AFG Fans Fight Video: భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌.. కొట్టుకున్న అభిమానులు

Published Thu, Oct 12 2023 9:43 AM

CWC 2023: Fight Breaks Out Between Fans In Delhi During Ind VS Afg World Cup 2023 Match - Sakshi

న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిన్న జరిగిన భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తిర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలోని స్టాండ్స్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవకు గల కారణాలు తెలియరాలేదు కాని గొడవకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతుంది.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఓ వ్యక్తిపై సామూహిక దాడి జరిగినట్లు తెలుస్తుంది. దెబ్బలు తిన్న వ్యక్తి, దాడి చేసిన వ్యక్తులు అంతా టీమిండియా అభిమానులే ఉన్నట్లున్నారు. దాడి జరిగిన సన్నివేశాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ "నిజమైన ఢిల్లీ అనుభవం" అని కామెంట్‌ చేశాడు. మ్యాచ్‌ గురించి ఏమో కాని ప్రస్తుతం సోషల్‌మీడియాలో దీనిపైనే జర్చ జరుగుతుంది. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌పై సూపర్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ విధ్వంసకర శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు)  టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. కోహ్లి (55 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (47), శ్రేయస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌) రోహిత్‌కు సహకరించారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్‌ (2/43), శార్దూల్‌ (1/31), కుల్దీప్‌ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రోహిత్‌ చెలరేగడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. కాగా, భారత్‌ అక్టోబర్‌ 14న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

Advertisement
Advertisement