సెమీస్‌కు చేరువలో ఆంధ్ర.. | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: సెమీస్‌కు చేరువలో ఆంధ్ర..

Published Mon, Feb 26 2024 7:10 AM

Ranji Trophy 2024: Andhra closes in on win vs MP - Sakshi

ఇండోర్‌: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోరీ్నలో సెమీఫైనల్‌ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్‌), కరణ్‌ షిండే (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4/28), శశికాంత్‌ (3/20), లలిత్‌ మోహన్‌ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు.    

Advertisement
Advertisement