త్వరితగతిన రిహాబిలిటేషన్‌ కేంద్ర నిర్మాణం | Sakshi
Sakshi News home page

త్వరితగతిన రిహాబిలిటేషన్‌ కేంద్ర నిర్మాణం

Published Thu, Nov 16 2023 12:04 AM

భవన నిర్మాణ మ్యాప్‌ను 
పరిశీలిస్తున్న కలెక్టర్‌   - Sakshi

నెల్లూరు సిటీ: పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారుల సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న న్యూట్రిషనల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ భవన నిర్మాణాన్ని అన్ని మౌలిక వసతులతో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నేత్ర విభాగ భవనాన్ని ఆధునికీకరించి ఎన్నార్సీ కేంద్రంగా అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో పనులను వైద్యాధికారులతో కలిసి కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బరువు తక్కువగా ఉన్న ఆర్నెల్ల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు.. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల సంరక్షణ కోసం ఎన్నార్సీ కేంద్రాన్ని రూ.30 లక్షలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో రూ.23 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ పెంచలయ్య, హాస్పిటల్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌నాయుడు, ఏపీఎమ్మెస్‌ఐడీసీ ఈఈ సుధాకర్‌, డీఈ సాంబశివరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement