తంగలాన్ గ్లింప్స్ విడుదల
ఆండ్రియా ప్రధాన పాత్రలో మణుసీ
శ్రీవల్లి 2.ఓను
చూస్తారు
నటుడు వివేక్ను స్మరించేలా..
తంగలాన్ చిత్రంలో విక్రమ్
రష్మిక మందన్న
తమిళసినిమా:
నటి రష్మిక మందన్నా ఆట మామూలుగా లేదుగా. మాతృభాష కన్నడ సినీ పరిశ్రమలో కిరాక్ చిత్రంతో కెరీర్ను ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తరువాత మాలీవుడ్లోనూ రంగప్రవేశం చేశారు. ఈ బ్యూటీని అక్కడ మాత్రం ప్రేక్షకులు నెత్తికెక్కించుకున్నారు. తెలుగులో ఛలో చిత్రంతో పయనాన్ని మొదలెట్టి పుష్ప చిత్రం వరకు దుమ్ము లేపారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప చిత్రంతో రష్మిక రేంజ్ మామూలుగా పెరగలేదు. బాలీవుడ్ వరకు మోత మోగింది. ఇక అక్కడ ఈమె తాజాగా నటించిన యానిమల్ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. అయినా రష్మిక కోలీవుడ్ వదలలేదు. ఇక్కడ సుల్తాన్, వారీసు చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా పుష్ప–2 చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు పుష్ప చిత్రంలో శ్రీ వల్లి పాత్రలో తన ఆట పాటలతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ పుష్ప–2లో శ్రీ వల్లి 2.ఓను చూస్తారని అంటున్నారు. ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రను సరిగా అవగాహన లేకుండా, అర్థమయ్యి, అర్థం కాని పరిస్థితుల్లో నటించానని, అయితే పుష్ప–2 చిత్రంలో తాను పాత్ర గురించి పూర్తి అవగాహన ఉండడంతో ఈ చిత్రంలో శ్రీవల్లి 2.ఓను చూస్తారని అన్నారు. ఈమె ఇలా అంటుంటే చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఏం రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
తమిళసినిమా : నటి వరలక్ష్మి శరత్కుమార్ తొలిసారి కథానాయకిగా నటించిన పాన్ఇండియా చిత్రం శబరి. న టుడు గణేష్ , వెంకట్రామన్, శ్యశాంక్, మైమ్ గోపి, నటి సునైనా, రాజశ్రీ నాయర్, మ దునందన్, ముంబయి నటి రశిక బాలి, ప్రభు, వైవా రా ఘవ, భద్రం, కృష్ణతేజ తదితరులు ముఖ్యపాత్రలు పో షించారు. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కొండ్ల నిర్మించిన ఈ చిత్రా నికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెల 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలిపారు. ఇది ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటి వరలక్ష్మి శరత్కుమార్ చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుర పరుస్తాయి. అంతకంటే ఫ్యామిలీ డ్రామా పడుతుందన్నారు. వరలక్ష్మి శరత్కుమార్తోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చిత్రం కోసం కఠినంగా శ్రమించారని పేర్కొన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన శబరి చిత్రాన్ని మే నెల 3వ తేదీన పాన్ఇండియా స్థాయిలో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. దీనికి రాహుల్ శ్రీవాత్సవ ఛాయాగ్రహణం, గోపి సుందర్ సంగీతం అందించారు.