స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం  | Sakshi
Sakshi News home page

స్వర్ణ తాపడానికి రూ.50లక్షల విరాళం 

Published Tue, Jan 18 2022 4:54 AM

50 Lakhs Donation For Yadadri Temple - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన బండారి బ్రదర్స్‌ సోమవారం తమ కుటుంబం తరఫున రూ.50లక్షల విలువైన డీడీలను ఈఓ గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారు ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, సోదరుల తరపున ఈ విరాళం అందించామని తెలిపారు. 

Advertisement
Advertisement