సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పంటి చికిత్స కోసం ఢిల్లీలోని ప్రముఖ డెంటిస్టును కలవడానికి సీఎం వెళ్తున్నారని సమాచారం. ఆయన ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు, మూడ్రోజులపాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలను విడుదల చేయాలని చాలాకాలంగా సీఎం కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మరోసారి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశాలున్నాయి. పలువురు ఇతర కేంద్ర మంత్రులను సైతం కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశముంది. అయితే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరలేదని, ఆయన్ను కలిసే అవకాశం లేదని ఆయన
కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నదీజలాల అంశంపై..: ఇక సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై మళ్లీ కసరత్తు మొదలైంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, జరిగిన నిర్ణయాలపై ఇరిగేషన్ శాఖ నివేదికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం రాష్ట్రం చేసిన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్కు సిఫార్సు చేయాలన్న విషయమై ఇప్పటికే అపెక్స్లో స్పష్టం చేసినా ఇంతవరకు స్పందన లేకపోవడంతో ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ వద్దని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎం స్వయంగా మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
Published Fri, Dec 11 2020 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement