TS: భారీగా ఎమ్మార్వోల బదిలీ | Huge Number Of MROs Transfer In Telangana - Sakshi
Sakshi News home page

MROs Transfer In Telangana: తెలంగాణలో 132 మంది ఎమ్మార్వోల బదిలీ

Published Sat, Feb 10 2024 8:51 PM

Huge Number Of Mros Transfer In Telangana  - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌ ఓటమి వెనుక ఆర్టీసీ కార్మికుల కృషి

Advertisement
Advertisement