Sakshi News home page

11,36,873 మంది తొలగింపు

Published Fri, Nov 11 2022 2:05 AM

Telangana Has 2, 95, 62, 932 Voters: CEO Vikas Raj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11,36,873 మంది ఓటర్లను తొలగించారు. కొత్తగా మరో 3,45,648 మందికి ఓటర్ల జాబితాలో చోటు కల్పించారు. ఈ ఏడాది జనవరి 5న ప్రక టించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 మంది సాధారణ ఓటర్లుండగా.. తాజా తొలగింపులు, చేరికల అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,62,932కి తగ్గింది.

వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2023లో భాగంగా ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ గురువారం విడుదల చేశారు.

డిసెంబర్‌ 8వరకు ఓటర్ల నమోదుకు అవకాశం
ముసాయిదా జాబితాలో 1,48,58,887 మంది పురుషులు, 1,47,02,391 మంది మహిళలు, 1,654 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 2,737 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 15,067 మంది సర్వీసు ఓటర్లు కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,80,736కు చేరింది. 18–19 ఏళ్ల వయస్సు కలిగిన యువ ఓటర్లు 83,207 మంది ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 8 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 

Advertisement

What’s your opinion

Advertisement