Sakshi News home page

భారీ స్క్రీన్‌పై వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌

Published Sat, Nov 18 2023 12:34 AM

- - Sakshi

విజయనగరం: భారత్‌–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల19న (ఆదివారం) క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. దీనిని నగర ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో విజయనగరం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేయనున్నామని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎమ్‌.ఎల్‌.ఎన్‌.రాజు, ట్రెజరర్‌ సీతారామరాజు శుక్రవారం తెలిపారు.

నగరంలోని ఐస్‌ ఫ్యాక్టరీ కూడలి సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ పక్కనున్న గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్రికెట్‌ ప్రేమికులు, క్రీడాకారులు, ప్రజలు, క్రీడాభిమానులు కార్యక్రమంలో పాల్గొని భారత్‌ క్రికెట్‌ జట్టు విజయానికి మద్దతు అందించాలని కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement