హసన్పర్తి: హసన్పర్తి మండలంలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల పరిశీలకుడు షణ్ముఘరాజన్ పరిశీలించారు. దేవన్నపేట, సుబ్బయ్యపల్లి, చింతగట్టు గ్రామాల్లోని పో లి ంగ్ కేంద్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ ప్రసాద్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
మడికొండ: కాజీపేట మండలం మడికొండ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎన్నికల అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మంలో ఎంత మంది ఓటర్లున్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఎల్ఓలు, అంగన్వాడీ టీచర్లు, హెచ్ఎం సంధ్యారాణి, మడికొండ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్సై దివ్య పాల్గొన్నారు.