రంగులు వేస్తూ జారి పడి పెయింటర్‌ మృతి | Sakshi
Sakshi News home page

రంగులు వేస్తూ జారి పడి పెయింటర్‌ మృతి

Published Sun, Nov 12 2023 1:46 AM

బందెల జయరాజు (ఫైల్‌)  - Sakshi

వీరవాసరం: రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి ఓ పెయింటర్‌ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. సత్యవరం గ్రామానికి చెందిన బందెల జయరాజు (35) పెయింటర్‌. రాయకుదురు చిన్నపేటలో చర్చి వద్ద పనులకు శనివారం వెళ్లాడు. ఎత్తులో నిలబడి రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భీమవరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఎస్సై పి.రమేష్‌ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై రమేష్‌ వివరించారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

పోలవరం రూరల్‌: పోలవరంలోని బాపూజీ కాలనీలో మహిళ హత్య కేసులో నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ కె.విజయబాబు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కొండరెడ్డి అయిన సంకురు బుజ్జమ్మ, పైడిపాక గ్రామానికి చెందిన షేక్‌ సుభాన్‌ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల బుజ్జమ్మ సుభాన్‌ను దగ్గరకు రానీయకపోవడంతో అమైపె అనుమానం, ద్వేషం పెంచుకున్న సుభాన్‌ శుక్రవారం ఉదయం బుజ్జమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా బుజ్జమ్మపై దాడి చేయడంతో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎస్సై ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్‌, సిబ్బందితో నిర్వహించిన దర్యాప్తులో సుభాన్‌ను నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. సుభాన్‌ను శనివారం అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ చెప్పారు.

Advertisement
Advertisement