గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లది కీలకపాత్ర | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లది కీలకపాత్ర

Published Tue, Mar 28 2023 1:24 AM

సన్మానం పొందిన సర్పంచులు, కార్యదర్శులు - Sakshi

భూదాన్‌పోచంపల్లి: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ కోట పుష్పలత అన్నారు. జిల్లా ఉత్తమ అవార్డులు పొందిన శివారెడ్డిగూడెం, జలాల్‌పురం, సాయినగర్‌ సర్పంచులు పీసర్ల మంజుల మహిపాల్‌రెడ్డి, పర్నె రజిత మల్లారెడ్డి, గౌని శోభదాసుగౌడ్‌లను సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సన్మానించారు. మండల ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికై న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు మెమొంటో, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్‌, ఎంపీడీఓ బాలశంకర్‌, సూపరింటెండెంట్‌ చంద్రమౌళి, ఎంపీఓ మాజిద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, రైతు సమన్వయసమితి కన్వీనర్‌ రావుల శేఖర్‌రెడ్డి, సర్పంచుల, ఎంపీటీసీల ఫోరమ్‌ అధ్యక్షులు సామ రవీందర్‌రెడ్డి, బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు ముత్యాల మహిపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement