Sakshi News home page

Published Fri, Mar 3 2023 12:58 AM

శివారెడ్డిని సన్మానిస్తున్న ఎన్‌ఎంయూ నాయకులు 
 - Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పల్లె వెంకట శివారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల విజయవాడలో రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి మూడోసారి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్‌ఎంయూ కడప జోనల్‌ సెక్రటరీ సుధాకర్‌ తెలిపారు. గురువారం శివారెడ్డిని యూనియన్‌ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్బంగా సుధాకర్‌ మాట్లాడుతూ శివారెడ్డి కడప జోన్‌లో డివిజనల్‌, రీజినల్‌, జోనల్‌, రాష్ట్ర కార్యదర్శులుగా కార్మికులు, ఉద్యోగులకు అనేక సేవలు అందించాన్నారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రీజినల్‌ చైర్మన్‌ రామిరెడ్డి, ప్రెసిడెంట్‌ నాగముని, కడప డిపో అధ్యక్ష, కార్యదర్శులు జయరాం, సగినాల శ్రీనివాసులు, రీజినల్‌ నాయకులు ఆర్‌.నారాయణ, దాస్‌, ప్రభాకర్‌, రంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement