Sakshi News home page

●ఆత్మగౌరవం కోసం....

Published Mon, Nov 20 2023 1:46 AM

-

రాబోయే ఎన్నికల్లో పెత్తందారులను పేదలంతా కలిసి దీటుగా ఎదుర్కోవాలని వివరించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సర్వసన్నద్ధులయ్యారు. ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేసిన తెలుగుదేశం పార్టీ ఓవైపు, సామాజిక స్థాయి, ఆర్థిక ఉన్నతి పెంచిన వైఎస్సార్‌సీపీ మరోవైపు ఉన్న నేపథ్యంలో ఆత్మగౌరవం నిలుపుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు చెందిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బడుగులకు అండగా ఉంటున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతూ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం మైదుకూరులో నిర్వహిస్తున్నారు. కెఎస్‌సీ కల్యాణమండపం నుంచి కార్లు ర్యాలీగా వచ్చి నాలుగు రోడ్లు కూడలి సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరవుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement