ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో డబ్బులు పంచారు. బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను రోడ్ షోలో ఏకరువు పెట్టిన బాలకృష్ణ.. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యాలని నంద్యాల ప్రజలను కోరి.. మళ్లీ అదే వాహనం మీది నుంచి వారికి డబ్బులు పంచడం విస్మయానికి గురి చేస్తోంది. బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఆయన పక్కనే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ఉన్నారు. కాగా, బాలకృష్ణ డబ్బులు పంపిణీ వ్యవహారం ఎన్నికల కమిషన్(ఈసీ) దృష్టికి వెళ్లింది. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలను ఈసీ, పలువురు ముఖ్య అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా, రోడ్ షో అనంతరం ఓ హోటల్లో బస చేయడానికి వెళ్లిన బాలకృష్ణ.. అక్కడికి ఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.
రోడ్ షోలో డబ్బులు పంచిన బాలకృష్ణ
Published Thu, Aug 17 2017 10:42 AM
Advertisement
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement