Sakshi News home page

'దళితుడి సీటు లాక్కున్న కేసీఆరే సారీ చెప్పాలి'

Published Wed, May 24 2017 7:15 PM

తెలంగాణకు అమిత్ షా క్షమాపణ చెప్పడం కాదని.. దళితుడి సీటు లాక్కుని అందులో ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకు కేసీఆరే క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్లలో 2వేల ఇళ్లు కూడా పూర్తిచేయనందుకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తాము కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి చేసే తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేవాళ్లం కామని, కేంద్రంలో ఉన్నది మన్మోహన్ సింగ్‌ ప్రభుత్వం కాదు.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో బీజేపీ ముందుందని చెబుతూ.. ''సాగరహారంలో నువ్వెక్కడ, రైల్‌రోకోలో నువ్వెక్కడ, మిలియన్ మార్చ్‌లో నువ్వెక్కడ కేసీఆర్'' అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement