'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు.. | Sakshi
Sakshi News home page

'హోదా' భిక్షకాదు 5 కోట్ల ఆంధ్రుల హక్కు..

Published Mon, Jan 30 2017 6:44 PM

ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు దండుకున్నారని అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ ఎన్ఆర్ఐలు మండిపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు గుప్పించారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ చాలు అంటూ మాట మారుస్తున్నారని..ఇది సిగ్గుమాలిన చర్య అని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు.