మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం! | Sakshi
Sakshi News home page

మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం!

Published Sun, Sep 11 2016 6:45 AM

మొన్నటి వరకు దేశాన్ని కుదిపేసిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మరవక ముందే యూపీఏ హయాంలో జరిగిందని భావిస్తున్న మరో విమాన కుంభకోణం తెరపైకి వచ్చింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో బ్రెజిల్ విమాన సంస్థ ఎంబ్రాయర్‌తో కుదిరిన ఒప్పందంలో అవినీతిపై సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 208 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14వేలకోట్లు) విలువైన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయంటూ అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది.