డెంటల్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

డెంటల్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Published Mon, Sep 18 2017 9:59 AM

బీడీఎస్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో చోటుచేసుకుంది. రాక్‌టౌన్‌ కాలనీలో నివాసం ఉంటున్న మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రిషికుమార్‌తో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన బాణోతు హారిక (24)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. ఇద్దరూ వరుసకు బావామరదళ్లు.