సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం

Published Mon, Nov 4 2013 6:10 PM

సికింద్రాబాద్ లో ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారం యత్నానికి ప్రయత్నించినట్టు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో స్నేహితుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి ఆర్మీ జవాన్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు ఫిర్యాదులో తెలిపినట్టు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిపై యువతి స్నేహితుడు తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ జవాన్లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు ఆర్మీ జవాన్లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.